లిక్కర్ కేసు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడో రోజు విచారణ, నిర్దోషి అంటూ నినాదాలు
లిక్కర్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు మూడో రోజు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం జైలు నుంచి విచారణకు తరలిస్తుండగా, చెవిరెడ్డి ఊహించని విధంగా “నేను ఏ తప్పు చేయలేదు, నాపై తప్పుడు కేసులు పెట్టారు” అంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ ఘటన అక్కడ కలకలం సృష్టించింది.
చెవిరెడ్డితో పాటు, లిక్కర్ కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు గురువారం కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వీరిద్దరినీ జైలు నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలోనే చెవిరెడ్డి తాను నిర్దోషినంటూ నినాదాలు చేశారు. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆయన ఆరోపించారు.
గత రెండు రోజుల విచారణలో చెవిరెడ్డి నుంచి సిట్ అధికారులకు ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడో రోజు విచారణ కీలకంగా మారింది. కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Read also:H1B : హెచ్1బీ తిరస్కరణ: శాపమా? వరమా? నితిన్ కౌశిక్ విశ్లేషణ
